{"version":"1.0","type":"rich","provider_name":"Acast","provider_url":"https://acast.com","height":250,"width":700,"html":"<iframe src=\"https://embed.acast.com/$/62b42d0a20f79900134ea578/62b42ed50e8fa20012ccbb6b?\" frameBorder=\"0\" width=\"700\" height=\"250\"></iframe>","title":"పల్నాటి వీరభారతం భాగం 1","thumbnail_width":200,"thumbnail_height":200,"thumbnail_url":"https://open-images.acast.com/shows/cover/1655975134868-79110f5ab9af49f3a062982e8582aef9.jpeg?height=200","description":"<p>పల్నాటి వీరభారతం ఒక చారిత్రాత్మిక నవల.</p><p><br></p><p>రచయిత: చిట్టిబాబు</p><p><br></p><p>Palnati Veera Bharatam is a historical fiction written by Chittibabu.</p><p><br></p><p>This is the podcast version of this wonderful historical fiction.</p><p><br></p><p>*****</p><p><br></p><p>చరిత్రలను వీరుల రక్తంతోను, వీరవనితల కన్నీటితోనూ కలగలిపి రాస్తేనేం…అది వీరభారతమైనప్పుడు! పల్నాటి పౌరుషం తెలుగువాణ్ణి, తెలుగునాణ్ణీ పునీతం చేసి, తరతరాల తెలుగు సంస్కృతిలో వెలలేని విలువైన మణిదీపమైనప్పుడు.</p><p><br></p><p>నిజానికి పల్నాటి రాళ్ళలోనూ, రప్పల్లోనూ పౌరుష ముండి తీరాలి. నాగులేటి నీళ్ళల్లో, నాపరాళ్ళల్లో వీరత్వం కనిపించకపోతే శ్రీనాథ కవిసార్వభౌముడి కవితాకన్య మృదుమధుర ద్విపద కవితారాగాన్ని పల్కించి వుండకపోవచ్చు.</p><p>ఐతే చరిత్ర చేసుకున్న మహాపాపమేమంటే; అది తన మహాప్రవాహంలో స్వచ్ఛమైన నీళ్ళతో పాటు చెత్తనీ, చెదారాన్నీ కలుపుకున్నది. కట్టుకథలు కావ్యాల్లో పుట్టిపెరిగి కొన్నిసార్లు రసాభాసగా తయారవుతాయి. అట్లాంటి కల్పితాలే లేకపోతే పల్నాటి చరిత్ర – వీరభారతమే.</p><p><br></p><p>జాతిని ఉద్దీపింపజేసేదీ, క్షాళితమైన హిందూరక్తంలో పవిత్రతతో పాటు వీరత్వాన్ని కలగజేసేదీ ఇటువంటి చరిత్రలే.</p><p><br></p><p>ఐతే పల్నాటి చరిత్రను ఎందుకు వ్రాయాల్సి వచ్చింది?</p><p>&nbsp;*****</p><p>పల్నాటి చరిత్రను పరిశీలించి చూస్తే ప్రతిపాత్రా సజీవ వీరరసోద్దీపనా చిహ్నమే. తల్చుకుంటే ఒళ్ళు జలదరించే సంఘటనా సంఘటితమే.</p><p><br></p><p>బ్రహ్మన్నా, బాలచంద్రుడూ, కన్నమదాసూ, అలరాజూ, వీరభద్రుడు ఇత్యాదులు మహావీరులైతే, మాంచాలా, పేరిందేవి, నాగమ్మా వీరవనితలైన తెలుగువాళ్ళ ఆడపడుచులు.</p><p>తెలుగునాట ఈ కథ మర్చిపోతే, తెలుగునోట ఈ కథ పలక్కపోతే – తెలుగులకు చరిత్రే లేదు. తెలుగులకు విలువే లేదు. ప్రతి జాతికీ ఒక వీరచరిత్ర కావాలి.</p><p>మాంచాలవంటి వీరపత్నులు రక్తసిందూరంతో భర్తల్ని యుద్ధరంగానికి పంపారు. ఇట్లాంటి కొంతమంది ధర్మపత్నులు రాసుకున్న వీరపారాణే జాతికి వెన్నెముక, దన్ను.</p><p><br></p><p>“నాయకీ నాగమ్మ – మగువ మాంచాల మా తోడబుట్టినవాళ్ళు!”</p><p><br></p><p>“నాగమ్మ తలగొట్టి నలగాముబట్టి మనసీమలో శాంతి వెలయింపజేయగా దీవించిపంపవే దేవి మాంచాలా!” – అని విన్నప్పుడు జలదరించిన శరీరంతో – ఈ నవల వ్రాయాలనుకున్నాను.</p><p>పారాణి పూసుకునే పవిత్రమైన పాదాలు కనిపించినప్పుడూ; పేరిందేవిలాంటి తెలుగు ఆడపడుచుల కన్నీటి కథల్లో కరిగిపోయినప్పుడూ – పల్నాటి నాగులేటి నీటిలో పారిన రక్తప్రవాహాల్తో ఈ తెలుగునేల తడిసి పునీతమై, గాలి – వీరగాధల్ని తెలుగునాడు వాడవాడలా మోసుకొచ్చినప్పుడు పల్నాటి కథలు ప్రజల గుండెల్లో నిండితీర్తాయి.</p><p><br></p><p>అందుకోసమైనా ఈ కథ వ్రాయాలి.</p><p><br></p><p>అందుకే ఇది వ్రాసాను.</p><p><br></p><p><strong>-చిట్టిబాబు</strong></p><p><br></p>","author_name":"MAHAA Podcasts"}